Share News

IAS officers: భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:16 PM

ఐపీఎస్‌ అధికారుల బదిలీలు ప్రక్రియ ముగియగానే భారీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను(IAS officers) ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటకశాఖ, జలమండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్‌ప్రసాత్‌ మనోహర్‌ను నగరాభివృద్ధి శాఖ అడిషినల్‌ సెక్రటరీగా బదిలీ చేసింది.

IAS officers: భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

బెంగళూరు: ఐపీఎస్‌ అధికారుల బదిలీలు ప్రక్రియ ముగియగానే భారీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను(IAS officers) ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటకశాఖ, జలమండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్‌ప్రసాత్‌ మనోహర్‌ను నగరాభివృద్ధి శాఖ అడిషినల్‌ సెక్రటరీగా బదిలీ చేసింది. నితేశ్‌ పాటిల్‌ను ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా, అరుంధతి చంద్రశేఖర్‌ను పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా, జ్యోతిని జౌళి అభివృద్ధి కమిషనర్‌గా, శ్రీధర్‌ సీఎన్‌ను గ్రామీణాభివృద్ధి సోషల్‌ఆడిట్‌ డైరెక్టర్‌గా, డాక్టర్‌ కేవీ రాజేంద్రను టూరిజం డైరెక్టర్‌గా, చంద్రశేఖర్‌ నాయక్‌ను కమర్షియల్‌ ట్యాక్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషినల్‌ కమిషనర్‌గా, విజయ్‌ మహంతేశ్‌ ధనమ్మనవర్‌ను హావేరి డీసీగా బదిలీ అయ్యారు.

దికూడా చదవండి: BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...


అలాగే.. గోవిందరెడ్డిని గదగ్‌ డీసీగా, రఘునందన్‌ మూర్తిని ట్రెజరీస్‌ కమిషనర్‌గా, డాక్టర్‌ గంగాధరస్వామిని దావణగెరె డీసీగా, లక్ష్మీకాంతరెడ్డిని మైసూరు డీసీగాను, నితీశ్‌ కేను రాయచూరు డీసీగా, మహ్మద్‌ రోషన్‌ను బెళగావి డీసీగా, శిల్పాశర్మను బీదర్‌ డీసీగా, డాక్టర్‌ దిలీశ్‌శశిని ఇ-గవర్నెన్స్‌ సీఈఓగా, లోఖండె స్నేహాల్‌ సుధాకర్‌ను విద్యుత్‌ కార్ఖానె ఎండీగా, శ్రీరూపను పశుసంవర్థకశాఖ కమిషనర్‌గా, ఇట్టె మాధవ్‌ విఠ్ఠల్‌రావ్‌ను పునరావాస విభాగం జీఎంగా, హేమంత్‌ను శివమొగ్గ జడ్పీ సీఈఓగా, మహ్మద్‌ అలి అక్రం షాను విజయనగర జడ్పీ సీఈఓగా ప్రభుత్వం బదిలీ చేసింది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 12:16 PM