Share News

Harash Nagotra: యువకుడు ఆత్మహత్య.. మోదీకి మృతుడి ఫ్యామిలీ లేఖ

ABN , Publish Date - Jul 14 , 2024 | 05:25 PM

జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహం పాకిస్థాన్‌లో లభ్యమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఆ మృతుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Harash Nagotra: యువకుడు ఆత్మహత్య.. మోదీకి మృతుడి ఫ్యామిలీ లేఖ

జమ్మూ కశ్మీర్, జులై 14: జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహం పాకిస్థాన్‌లో లభ్యమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఆ మృతుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అందుకోసం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని వారు కోరారు. భారత్ - పాక్ సరిహద్దు అక్నూర్ సెక్టార్‌లోని గ్రామానికి చెందిన హర్ష నగోత్ర. ఈ ఏడాది జూన్ 11వ తేదీన అదృశ్యమైనాడు. దీంతో అతడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!


ఆ క్రమంలో చీనాబ్ నది ఒడ్డున హర్ష నగోత్రకు చెందిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఆన్‌లైన్ గేమ్‌ ద్వారా అతడు వేలాది రూపాయిల నగదు నష్టపోయాడని.. దీంతో అతడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల తమ ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అయితే హర్ష నగోత్ర సెల్ ఫోన్‌ను అతడి తల్లిదండ్రులు రీ యాక్టివేట్ చేశారు. ఆ క్రమంలో హర్ష నగోత్ర మృతి చెందినట్లు పాకిస్థాన్ అధికారి నుంచి అతడి పోన్‌కు సందేశం వచ్చింది. అలాగే జూన్ 13వ తేదీన పంజాబ్ ప్రావిన్స్‌లోని సియల్ కోట్ వద్ద హర్ష నగోత్ర మృతదేహాన్ని గుర్తించామని వారు.. ఈ వాట్సప్ సందేశంలో స్పష్టం చేశారు. అదే విధంగా అతడి ఐడీ కార్డును సైతం వాట్సప్‌‌లో పోస్ట్ చేశారు. దీంతో తమ కుమారుడు మృతి చెందాడని... అతడి మృతదేహం పాక్‌లో ఉందని హర్ష నగోత్ర తల్లిదండ్రులు ధృవీకరించారు.

Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం

Also Read: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు


ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి అతడి తండ్రి సుభాష్ శర్మ విజ్జప్తి చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం, హోం మంత్రితోపాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం లేఖలు రాసినట్లు మృతుడి తరఫు బంధువులు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుడు మృతితో తామంతా షాక్‌లో ఉన్నామన్నారు. దాంతో అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావాలని భారత ప్రభుత్వానికి వారు విజ్జప్తి చేశారు. అలాగే మృతదేహాన్ని భారత్‌కు అప్పగించాలని పాక్ ప్రభుత్వానికి సైతం హర్ష నగోత్ర కుటుంబ సభ్యులు విన్నవించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 05:26 PM