Share News

Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్‌!

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:50 AM

హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరే మూడు ప్రధాన రైళ్ల వేళల్లో మార్పులు చేశామని రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్‌!

  • నారాయణాద్రి, పద్మావతి, సింహపురి వేళల్లో మార్పులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరే మూడు ప్రధాన రైళ్ల వేళల్లో మార్పులు చేశామని రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్‌-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ ఇకపై ప్రతిరోజూ సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10.05 గంటలకు, లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరతాయని వెల్లడించారు. మారిన రైళ్ల వేళలు ఆదివారం నుంచి వర్తించనున్నాయని శ్రీధర్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 03:50 AM