Share News

Dasoju Sravan: ముఖ్యమంత్రి హోదాలో చిల్లర పనులు చేస్తున్న రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 17 , 2024 | 10:04 PM

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చిల్లర పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసివి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

Dasoju Sravan: ముఖ్యమంత్రి హోదాలో చిల్లర పనులు చేస్తున్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చిల్లర పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసివి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్.. ఇప్పుడు తన పార్టీలోనే ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో చట్టబద్దంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొట్టిన రేవంత్ ఇపుడు ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన వారికి రాజ్యాంగ బద్ధంగానే చావుదెబ్బ తీస్తామని..డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తామని హెచ్చరించారు. గతంలో దానం నాగేందర్‌ను బీడీలు అమ్ముకునే వ్యక్తి అని రేవంత్ అనలేదా అని నిలదీశారు.

ఈరోజు గాంధీభవన్‌లో నాగేందర్‌తో బీడీలను రేవంత్ అమ్మిస్తారా అని దెప్పి పొడిచారు. ఆయన గతంలో కాంగ్రెస్‌ను వదిలినప్పుడు బీసీలకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేదన్నారని.. మళ్ళీ ఏ ముఖంతో మళ్లీ కాంగ్రెస్ చెంతకు చేరారని ప్రశ్నించారు. 119 సీట్లలో 60 సీట్లు బీసీలకు ఇచ్చారని కాంగ్రెస్‌లోకి నాగేందర్ పోయారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన అందరినీ రేవంత్ రాళ్లతో కొడుతారా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల కాదని.. ప్రజల నమ్మకం నిలుపుకోవాలని సీఎం రేవంత్‌కు దాసోజ్ శ్రావణ్ హితవు పలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 10:16 PM