Share News

Raja Singh: తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టాలి.. సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 12 , 2024 | 09:46 PM

తెలంగాణలో డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. యూపీలో యోగీ ప్రభుత్వం క్రైం రేటును కంట్రోల్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని కోరారు.

Raja Singh: తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టాలి.. సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి
Raja Singh

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. యూపీలో యోగీ ప్రభుత్వం క్రైం రేటును కంట్రోల్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని కోరారు. డ్రగ్స్ కంట్రోల్ కోసం హీరో, హీరోయిన్లు ముందుకు రావాలని చెప్పారు. ప్రభుత్వం భయం పెట్టకుంటే డ్రగ్స్ వినియోగించేవారు వినరని అన్నారు.


సినీనటులు మెగాస్టార్ చిరంజీవి తరహాలో మిగతా హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్‌ను అరికట్టాడానికి కృషి చేయాలని కోరారు. ట్విన్ సిటీస్‌లోని అన్ని పబ్స్‌లో డ్రగ్స్ సప్లై జరుగుతుందని అన్నారు. పబ్స్‌పై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 09:47 PM