Share News

TS Politics: ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jan 20 , 2024 | 06:58 PM

ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్య చోటుచేసుకుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ( Konda Vishweshwar Reddy ) ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.

TS Politics:  ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

హైదరాబాద్: ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనే పరిస్థితి రాజకీయాల్లో తరచుగా చూస్తునే ఉంటాం. అలాంటింది ఇద్దరు ప్రత్యర్థులు ఓ విషయంలో గొడవ పడితే రణరంగమే అవుతుంది. అలాంటి సంఘటనే ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్య చోటుచేసుకుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ( Konda Vishweshwar Reddy ) ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. తన అనుచరులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు కలిశారని ఫోన్‌లో రంజిత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి తోడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ప్రత్యర్థిపై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. రంజిత్‌రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన వాళ్లను తీసుకువెళ్లాలని సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే విషయంలో రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 20 , 2024 | 07:02 PM