Share News

ELECTION: అందుబాటులో లేని ఎంపీటీసీలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:30 AM

ఈ నెల 27న రామగిరి మం డల ప్రజాపరిషత అధ్య క్ష ఎన్నిక జరగనుండ డంతో ఎంపీటీసీలకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి నోటీసులు పం పారు. శని, ఆదివారాల్లో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఆరుగురు ఎంపీ టీసీలు అందుబాటులోలేరు. అందుబాటులో లేని ఎంపీటీసీలందరూ వైసీపీ వర్గీయులే. పేరూరు-2, కొండాపురం, ఎంసీపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, పోలేపల్లి ఎంపీటీసీలు అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి గోడలకు అధికారులు నోటీసులు అతికించారు.

ELECTION: అందుబాటులో లేని ఎంపీటీసీలు
Officials are pasting notices at the homes of MPTC members.

- ఎంపీపీ ఎన్నికకు హాజరు కావాలని నోటీసులు

రామగిరి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఈ నెల 27న రామగిరి మం డల ప్రజాపరిషత అధ్య క్ష ఎన్నిక జరగనుండ డంతో ఎంపీటీసీలకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి నోటీసులు పం పారు. శని, ఆదివారాల్లో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఆరుగురు ఎంపీ టీసీలు అందుబాటులోలేరు. అందుబాటులో లేని ఎంపీటీసీలందరూ వైసీపీ వర్గీయులే. పేరూరు-2, కొండాపురం, ఎంసీపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, పోలేపల్లి ఎంపీటీసీలు అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి గోడలకు అధికారులు నోటీసులు అతికించారు. ఫోనద్వారా సమాచారం ఇచ్చేందుకు కూడా వారు అందుబాటులో లేరని తెలిసింది. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 9 స్థానాల్లో వైసీపీ వర్గీయులు, ఒకచోట టీడీపీ గెలిచింది. అందులో ఇద్దరు అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆరుగురిని వైసీపీ నాయకులు తమ ఆధీనంలో ఉంచుకున్నట్టు సమాచారం. జనరల్‌ మహిళకు ఎంపీపీ రిజర్వు కావడంతో.. మహిళా ఎంపీటీసీలైన ఎంసీపల్లి, పేరూరు-2 వారికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎంసీపల్లి ఎంపీటీసీ ఆదిలక్ష్మి పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 24 , 2025 | 12:33 AM