Key Development.. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Feb 17 , 2025 | 10:59 AM
ముదునూరి సత్యవర్ధన్ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi ) కేసు (Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీ అనుచరులు కిడ్నాప్ (Kidnap) చేసిన సత్యవర్ధన్ (Satyavardhan)ను పోలీసులు సోమవారం కోర్టుకు తీసుకురానున్నారు. 164 కింద స్టేట్ మెంట్ రికార్డు చేయాలని అధికారులు పిటిషన్ వేశారు. కాగా ఇప్పటికే 161 కింద పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈరోజు ఆ స్టేట్ మెంట్ రికార్డుకు ఛీప్ మెట్రో పాలిసెషన్ కోర్టు న్యాయమూర్తి కోర్టును నిర్దేశించనున్నారు. సత్యవర్ధన్ను బెదిరించిన కేసులో వంశీ అనుచరులు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా విచారణ నిమిత్తం పది రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ వార్త కూడా చదవండి..
రాజకీయ రిటైర్మెంట్పై కేశినేని నాని ఏమన్నారంటే..
కోర్టుకు సత్యవర్ధన్ వాంగ్మూలం
ముదునూరి సత్యవర్ధన్ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్కు లేఖ రాశారు. సత్యవర్ధన్ నుంచి 164 వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు కోర్టును కేటాయించాలని పేర్కొన్నారు. దీనిపై సీఎంఎం కోర్టు సోమవారం నిర్ణయం తీసుకుని కోర్టును కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
వంశీకి జైలులో భద్రత..
కాగా విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్యారక్కు అధికారులు పరదాలు కట్టినట్టు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా, జైలు అధికారులు ఆయనకు ఒకటో నంబరు బ్యారక్లో గదిని కేటాయించారు. అందులో ఉన్న వంశీ ఇతర ఖైదీలకు కనిపించకుండా కటకటాల వద్ద పరదా కట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇతర ఖైదీలెవరూ వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బ్యారక్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వంశీతో జగన్ ములాఖత్ రేపు..
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం విజయవాడలోని జిల్లా కారాగారానికి రానున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శిస్తారని తెలిసింది. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్లోని జైలుకు వెళ్తారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్త జనసంద్రంగా మారిన పెద్దగట్టు
ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News