Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:38 PM
రెండు రోజుల్లోనే 30 లక్షల 77 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు మధ్యప్రదేశ్కు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మొత్తం బృందాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాజధాని భోపాల్లో 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ చివరి రోజైన నేడు అమిత్ షా హాజరైన క్రమంలో పేర్కొన్నారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్ను అనారోగ్య రాష్ట్రాలలో ఒకటిగా లెక్కించారన్న ఆయన, ఇప్పుడు విద్యుత్, రోడ్లు, నీటి పరంగా ఎంపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో గనులు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయన్నారు. గత 20 ఏళ్లలో 5 లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించబడ్డాయని, రాష్ట్రం 25 శాతం పత్తిని కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. దీంతో మధ్యప్రదేశ్ దేశానికి పత్తి రాజధానిగా మారిందన్నారు.
ఈ క్రమంలో మధ్యప్రదేశ్తో రూ. 30,77,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాల(MOU)పై సంతకాలు జరిగాయని అమిత్ షా ప్రస్తావించారు. రెండు రోజుల్లో రెండు వందలకు పైగా భారతీయ కంపెనీలు, రెండు వందలకు పైగా గ్లోబల్ కంపెనీల CEOలు, ఇరవైకి పైగా యూనికార్న్ వ్యవస్థాపకులు, యాభైకి పైగా దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్కు కూడా ఒక ముఖ్యమైన రాష్ట్రంగా పరిగణించబడుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి మంచి వాతావరణం లభిస్తుందని తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు అమిత్ షా.
అంతేకాదు ఎంపీ మన దేశ గొప్ప వారసత్వాన్ని కూడా గుర్తు చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. దీంతోపాటు 2047 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో మధ్యప్రదేశ్ ముఖ్యమైన సహకారాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ క్రమంలో భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, వివిధ రంగాలలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన విధానాలు భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడంలో సహాయపడతాయన్నారు. ఇక్కడ అభయారణ్యం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా ఉందన్నారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి 25న ముగిసింది. దేశంలోని అనేక మంది కీలక పారిశ్రామికవేత్తలు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News