మంత్రి కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2021-03-11T17:26:20+05:30 IST
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలపై..పార్లమెంట్లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారని ఆయన...

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరుశాతం అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నంపై ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని మంత్రి కేటీఆర్ మద్ధతు ఉంటుందని బుధవారం నాడు ప్రకటించిన విషయం విదితమే. అంతేకాదు.. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
విశాఖ ఉక్కు పోరాటానికి మీ మద్దతు వెనుక దురుద్దేశం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడతారా?. మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడరు. మీరు జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూడా రారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం మాత్రం వచ్చా..?. ఎన్నికలయ్యాక ఇచ్చిన హామీలను మరచిపోవడం మీకు మీ పార్టీకి అలవాటుగా మారింది. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలపై పార్లమెంట్లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా?’ అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీపై గల్లీలో మీ మాటలకు ఢిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదని రేవంత్ రెడ్డి లేఖలో రాసుకొచ్చారు.