YCP MP: సింగిల్‌గా పోటీచేస్తామనే దమ్ము పవన్ కళ్యాణ్‌కు లేదు.. ఎమ్మెల్యేకు పూర్తిగా అనర్హుడు..

ABN , First Publish Date - 2023-07-01T16:49:06+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (YCP MP Nandigam Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

YCP MP: సింగిల్‌గా పోటీచేస్తామనే దమ్ము పవన్ కళ్యాణ్‌కు లేదు.. ఎమ్మెల్యేకు పూర్తిగా అనర్హుడు..

తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (YCP MP Nandigam Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్‌గా పోటీచేస్తామనే దమ్ము పవన్ కళ్యాణ్‌కు లేదని నందిగం సురేష్ విమర్శించారు. తమ సీఎం జగన్‌ను చూసి బయపడుతున్నారని, అబద్దాలు ఆడడంలో చంద్రబాబు కన్నా మించిపోయారని మండిపడ్డారు. మంత్రులను తాటతీస్తా తోక్కతీస్తా అంటున్నారని, పవన్‌కు రెండుచోట్ల పైనుంచి కిందవరకూ లాగేశారని ఎద్దేవా చేశారు. ఏనాడైనా రాజకీయ నాయకుడిలా పవన్ మాట్లాడలేదని, పవన్ కళ్యాణ్ ఆకురౌడిగా వందశాతం కరెక్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఎమ్మెల్యేకు ఆయన పూర్తిగా అనర్హుడు. ఈ రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిలా పవన్ తయారయ్యాడు. నీకంటే దారుణంగా మేము మాట్లాడగలం. స్టేజీ మీద నువ్వు మాట్లాడుతుంటే శాడిస్టు వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. ఆ ఊగటమేంది వాడగమేంది పవన్ కళ్యాణ్. అదేస్టేజి మీద నువ్వు మాట్లాడు. నేను మాట్లాడుతా. నేను మాట్లాడితే నువ్వు చెవులు మూసుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్‌ తోకలో ఈక లాంటి వాడు. పవన్‌వి పిల్ల ఊపులు. ఉడుతకండ ఊపులు. ముందు పవన్ ఎమ్మెల్యేగా గెలవు. అసెంబ్లీ గేటుదగ్గర నిలబడి చెప్పు. రాజధాని అసైస్డ్ భూముల అన్యాక్రాంతం వెనుక ఎవ్వరున్నా అరెస్టు అవుతారు. చంద్రబాబు, నారాయణ, పుల్లారావుతో సహా అందరూ అరెస్టు అవ్వాల్సిందే.'' అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.

Updated Date - 2023-07-01T16:49:15+05:30 IST