Share News

CWC: ఆసక్తికరంగా సీడబ్ల్యూసీ.. ప్రధానంగా చర్చించిన విషయాలివే..

ABN , Publish Date - Dec 21 , 2023 | 03:52 PM

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మూడోసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు.

CWC: ఆసక్తికరంగా సీడబ్ల్యూసీ..  ప్రధానంగా చర్చించిన విషయాలివే..

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మూడోసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు. బీజేపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపైవ్యూహాలు ప్రతి వ్యూహాలపై చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమితో కలిసి పనిచేయడం, దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండోవిడత జనవరిలో తూర్పు నుంచి పడమర వరకు చేపట్టాలనే ప్రతిపాదనపై కూడా చర్చించినట్లు తెలస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు చేసే జోడో యాత్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాల అంశాలపైనా సీడబ్ల్యూసీలో ఈ చర్చ జరగనున్నది. పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో మెగా ర్యాలీతో జరుపుకోవడానికి ముందు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉన్న విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, మీరా కుమారి, అజయ్ మాకెన్, మానిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, టి సుబ్బిరామిరెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 03:52 PM