World Record: ధోనీ ప్రపంచ రికార్డును అధిగమించిన బెన్ స్టోక్స్

ABN , First Publish Date - 2023-07-10T17:24:30+05:30 IST

ఇప్పటివరకు టెస్టుల్లో 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎక్కువ సార్లు ఛేదించిన టీమ్ కెప్టెన్‌గా రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా నాలుగు సార్లు 250కి పైగా టార్గెట్లను ఛేదించి విజయాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాపై 251 పరుగుల టార్గెట్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ అధిగమించి గెలిచింది. అయితే స్టో్క్స్ కెప్టెన్‌గా 250 రన్స్‌కు పైగా టార్గెట్లను ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి. దీంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ అధిగమించాడు.

World Record: ధోనీ ప్రపంచ రికార్డును అధిగమించిన బెన్ స్టోక్స్

ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ (Ashes Series) ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో ఇంగ్లండ్ (England) విజయం సాధించి ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ 80 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (Harry brook) 75 పరుగులతో రాణించాడు. దీంతో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇప్పటివరకు టెస్టుల్లో 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎక్కువ సార్లు ఛేదించిన టీమ్ కెప్టెన్‌గా రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా నాలుగు సార్లు 250కి పైగా టార్గెట్లను ఛేదించి విజయాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాపై 251 పరుగుల టార్గెట్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ అధిగమించి గెలిచింది. అయితే స్టో్క్స్ కెప్టెన్‌గా 250 రన్స్‌కు పైగా టార్గెట్లను ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి. దీంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ అధిగమించాడు. వీళ్లిద్దరి తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్, బ్రియాన్ లారా ఉన్నారు. వీళ్ల కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మూడేసి సార్లు 250కి పైగా రన్స్‌ను ఛేదించాయి. కాగా ఐపీఎల్‌లో ధోనీ, స్టోక్స్ ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

నాలుగో టెస్టుకు ఆసీస్ జట్టులో మార్పులు

కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో గెలిచి 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా మరొక టెస్టు గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. అయితే మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు రాణించినా బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా ఓపెనర్ వార్నర్ పేలవ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో నాలుగో టెస్టుకు అతడిపై వేటు పడే అవకాశం ఉంది. ఓపెనర్లుగా ఖవాజా, లబుషేన్‌లను బరిలోకి దించి వార్నర్ స్థానంలో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఆసీస్ తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పేసర్ బోలెండ్ స్థానంలో హేజిల్ వుడ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి:

MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

Dhoni Birthday: మిడిల్ క్లాస్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా..!!

Updated Date - 2023-07-10T17:33:45+05:30 IST