Cheteshwar Pujara: వందో టెస్టు ఆడుతున్న పుజారాకు గవాస్కర్ స్పెషల్ గిఫ్ట్
ABN , First Publish Date - 2023-02-17T16:01:44+05:30 IST
టీమిండియా స్టార్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత సాధించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టులో మైదానంలోకి దిగిన పుజారాకు ఇది వందో టెస్టు. ఫలితంగా వందో టెస్టు ఆడుతున్న 13వ ఇండియన్ క్రికెటర్గా ఎలైట్ జాబితాలోకి అడుగుపెట్టాడు. అలాగే, ప్రస్తుత జట్టులో కోహ్లీ ఒక్కడే వంద టెస్టులు ఆడాడు. ఇప్పుడతడి సరసన పుజారా చేరాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు పుజారాకు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ప్రత్యేక క్యాప్ అందించాడు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ.. వందో టెస్టులు వంద కొట్టిన తొలి భారత ఆటగాడివి కావాలని ఆకాంక్షించాడు. ఆ తర్వాత పుజారా మైదానంలోకి దిగుతున్నప్పుడు సహచర ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది.
2010లో ఆస్ట్రేలియాపైనే తొలి టెస్టు..
బెంగళూరులో 2010లో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మ్యాచ్లో పుజారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాపైనే వందో టెస్టు ఆడబోతున్నాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో పుజారా నంబర్ 3లో బ్యాటింగ్కు దిగి 72 పరుగులు చేశాడు. అతడి చలువతో 207 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది
ఆసీస్పై ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడిన పుజారా 52.77 సగటుతో 1900 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018-19లో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించినప్పుడు పుజారా అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ సిరీస్లో విజయం సాధించిన భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలిసారి టెస్టు సిరీస్ను కైవసం చేసుకుని రికార్డులకెక్కింది.
ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన పుజారా 44.15 సగటుతో 7,021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన పుజారా పలుమార్లు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. గతేడాది బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన టెస్టులో వేగవంతమైన టెస్టు సెంచరీ చేశాడు.