Niranjan Reddy: కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది

ABN , First Publish Date - 2023-09-28T17:25:50+05:30 IST

భవిష్యత్ లో వనపర్తికి తాగునీటి కొరత ఉండదు. రూ.425 కోట్ల మిషన్ భగీరథ పనులు పూర్తి చేశాం. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్‌ను నిర్మిస్తాం. రూ.20 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార, పండ్లు

Niranjan Reddy: కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది

వనపర్తి జిల్లా: సీఎం కేసీఆర్ (Cm kcr) నాయకత్వంలో ఎంతో దూరదృష్టితో నీటిపారుదల పనులు కొనసాగిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Singireddy Niranjan Reddy) తెలిపారు. వనపర్తిలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం కాఫీ టేబుల్ బుక్‌ను నిరంజన్ రెడ్డి విడుదల చేసి మాట్లాడారు. రేపు వనపర్తి నియోజక వర్గంలో మంత్రులు కేటీఅర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ పర్యటిస్తున్నట్లు తెలిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.

‘‘భవిష్యత్ లో వనపర్తికి తాగునీటి కొరత ఉండదు. రూ.425 కోట్ల మిషన్ భగీరథ పనులు పూర్తి చేశాం. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్‌ను నిర్మిస్తాం. రూ.20 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార, పండ్లు, పూల మార్కెట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. రూ.76 కోట్ల బైపాస్ రహదారి నిర్మాణానికి.. రూ.48 కోట్ల పెబ్బేరు రహదారి నిర్మాణానికి రేపు శంకుస్థాపన. రూ.22 కోట్లతో వనపర్తి రాజప్రాసాదం పునరుద్దరణ, శిథిలమైతున్న పాలిటెక్నిక్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన. భవిష్యత్‌లో చిట్యాల, రాజనగరం మీదుగా మరో బైపాస్ రహదారి. మొదటిదశలో సంకిరెడ్డిపల్లిలో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన. నూతన పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా వేలాది మందికి ఉపాధి.’’ కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-28T17:25:50+05:30 IST