Laxman: గులాబీ గుండాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-08-24T19:04:28+05:30 IST

బీజేపీ(BJP) కార్యకర్తలపై దాడి చేసిన గులాబీ గుండాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్( Laxman) డిమాండ్ చేశారు.

 Laxman: గులాబీ గుండాలపై చర్యలు తీసుకోవాలి

హనుమకొండ : బీజేపీ(BJP) కార్యకర్తలపై దాడి చేసిన గులాబీ గుండాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్( Laxman) డిమాండ్ చేశారు. గురువారం నాడు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) నేతల కార్యాలయాలు, ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. వరంగల్ బీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్(Dasyaam Vinay Baskar) క్యాంప్ కార్యాలయం ముట్టడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన కమలం నాయకులపై బీఆర్ఎస్ రౌడీలు దాడులకు పాల్పడారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, లక్ష్మణ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో లక్ష్మణ్ మాట్లాడాతూ.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ గుండాల పాలన నిజాంను తలపిస్తోందన్నారు. గడీల రాజ్యాన్ని బద్దలు కొడతామని హెచ్చరించారు. రేపు కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ అగ్ర నాయకులు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-08-24T20:03:05+05:30 IST