Share News

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంతమంది గాయపడ్డారంటే..?

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:02 AM

దేవరపల్లి మండలం బందపురం వద్ద జాతీయ రహదారి(National Highway) ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని(lorry) వెనక నుంచి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మరో 10మందికి స్వల్పగాయాలు అయ్యాయి.

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంతమంది గాయపడ్డారంటే..?

తూర్పు గోదావరి: దేవరపల్లి మండలం బందపురం వద్ద జాతీయ రహదారి(National Highway) ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని(lorry) వెనక నుంచి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మరో 10మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 11:04 AM