Share News

AP Elections: తాడిపత్రి టు హైదరాబాద్.. జేసీ ఫ్యామిలీ తరలింపు..!!

ABN , Publish Date - May 16 , 2024 | 04:57 PM

భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.

 AP Elections: తాడిపత్రి టు హైదరాబాద్.. జేసీ ఫ్యామిలీ తరలింపు..!!
JC Diwakar Reddy And Family

అనంతపురం, మే 16: భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హైదరాబాద్ తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు హైదరాబాద్‌కు పంపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే

AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!

జేసీ దివాకర్ రెడ్డి సహాయకులను ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు అంగీకరించలేదు. విషయం తెలుసుకున్న దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రి వచ్చారు. పవన్‌ను కూడా ఇంట్లోకి పంపేందుకు పోలీసులు అంగీకరించలేదు.


LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

తన కన్నతల్లి అనారోగ్యంతో ఉంటే ఇంట్లోకి వెళ్లొద్దంటూ అడ్డుకుంటున్న పోలీసులపై పవన్ మండిపడ్డారు. దాంతో పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండడానికి వీలు లేదని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ క్రమంలో జేసీ ఫ్యామిలీని భారీ భద్రత మద్య హైదరాబాద్ తరలించారు.

IncomeTax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్

పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. జేసీ దివాకర్ రెడ్డి నివాసం వద్ద, ఆయన రాజకీయ ప్రత్యర్థి కేతిరెడ్డి నివాసం వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 06:09 PM