Share News

Pawan Kalyan: ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:29 AM

జాతీయ బాలల హక్కుల కమిషన్(National Child Rights Commission) పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణతేజ (IAS Krishna Teja)కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు.

Pawan Kalyan: ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

అమరావతి: జాతీయ బాలల హక్కుల కమిషన్(National Child Rights Commission) పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణతేజ(IAS Krishna Teja)కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణతేజ.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్ (Thrissur) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని.. దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర


ఐఏఎస్ కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా కష్ట కాలం, కేరళ వరదల విపత్తు సమయంలోనూ విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావాన్ని కేరళ ప్రజలు మరచిపోలేరని పవన్ అన్నారు. మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. త్వరలోనే జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారం అందుకోనున్న కలెక్టర్‌ కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

Kumaraswamy: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి కుమారస్వామి..

Updated Date - Jun 15 , 2024 | 11:33 AM