Share News

ప్రొద్దుటూరు అభివృద్ధిపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే వరద

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:28 PM

విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశ అనంతరం సీఎం చంద్రబాబును ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.ప్రొద్దుటూరులో అభివృ ద్ధి కార్యక్రమాల నిధుల కేటాయింపుతో పాటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఆయన సీఎంకు వినతి పత్రం అందజేశారు.

ప్రొద్దుటూరు అభివృద్ధిపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే వరద

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 20 : విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశ అనంతరం సీఎం చంద్రబాబును ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.ప్రొద్దుటూరులో అభివృ ద్ధి కార్యక్రమాల నిధుల కేటాయింపుతో పాటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఆయన సీఎంకు వినతి పత్రం అందజేశారు. అలాగే త్వరలో నియామకం చేపట్టబోయే నామినేటెడ్‌ పదవుల్లో ప్రొద్దుటూరులో పార్టీకోసం పనిచేసిన నాయకులకు న్యాయం చేయాలని లిస్టును అందజేశారు. సీఎం ను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ వీఎస్‌ ముక్తియార్‌, మాజీ జడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:29 PM