Share News

Chandrababu Oath Ceremony: ఇవాళ విజయవాడ రానున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్..

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:26 PM

ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.

Chandrababu Oath Ceremony: ఇవాళ విజయవాడ రానున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్..

విజయవాడ: ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. అయితే పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు జూన్ 12న నిర్వహించే కార్యక్రమానికి ఇవాళ, రేపు భారీగా విజయవాడకు చేరుకుంటున్నారు.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఇవాళ ఏపీకి రానున్నారు. రాత్రి 9:35గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sajay) ఇవాళ రాత్రి విజయవాడకు రానున్నారు. వీరిద్దరూ జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి:

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

Chandrababu: చంద్రబాబును చూసేందుకు కాన్వాయ్ వెంట పడిన మహిళలు..

Updated Date - Jun 11 , 2024 | 04:28 PM