Share News

Heavy Rains: పడవల ద్వారా ఆహారం సరఫరా.. కాసేపట్లో సింగ్‌నగర్‌‌కు చంద్రబాబు

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:34 AM

Andhrapradesh: భారీ వర్షాలకు విజయవాడ వాసులు వణికిపోయారు. కుండపోత వర్షాలతో సింగ్‌నగర్‌లోని బుడమేరు మహోగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా ప్రజలు బుడమేరు ముంపులోనే ఉండిపోయారు. అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆహారం, మంచినీటిని పడవల ద్వారా బాధితులకు అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో సింగ్‌నగర్‌కు రానున్నారు.

Heavy Rains: పడవల ద్వారా ఆహారం సరఫరా.. కాసేపట్లో సింగ్‌నగర్‌‌కు చంద్రబాబు
Heavy Rains

విజయవాడ, సెప్టెంబర్ 3: భారీ వర్షాలకు విజయవాడ వాసులు వణికిపోయారు. కుండపోత వర్షాలతో సింగ్‌నగర్‌లోని బుడమేరు మహోగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా ప్రజలు బుడమేరు ముంపులోనే ఉండిపోయారు. అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆహారం, మంచినీటిని పడవల ద్వారా బాధితులకు అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో సింగ్‌నగర్‌కు రానున్నారు. ఈక్రమంలో సింగ్‌నగర్ ఫ్లైఓవర్ పై అన్ని రకాల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఎవరైనా నడుస్తూ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు తీరుపై వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu: రెండోరోజు సహాయక చర్యల్లో ఏపీ సీఎం చంద్రబాబు


కాగా... ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకూ మహోగ్రరూపం చూపించిన బుడమేరుకు ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. కుంభవృష్టి నమోదు కావడంతో బుడమేరు మహాగ్రరూపం దాల్చింది. ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లను వరద ముంచెత్తింది. 48 గంటలుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం వరద నీటిలోనే ఉండిపోయింది. చివరి వరకూ వారికి ప్రభుత్వ సహాయక చర్యలు అందలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా మకాం వేసినా కూడా చివరి వరకు సహాయం చేరలేదు. బుడమేరులో ప్రస్తుతం, 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు...

Rain Effect: ప్రకాశం బ్యారేజ్‌కి స్వల్పంగా తగ్గిన వరద ఉద్ధృతి..


బుడమేరు వరదలో తాజాగా మహిళ గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బుడమేరు వరదలో జి.కొండూరు నుంచి హెచ్.ముత్యాలంపాడు గ్రామానికి ట్రాక్టర్‌పై వెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. బుడమేరుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వరద ధాటికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ పై 10 మంది గ్రామస్థులు ఉండగా.. వారిలో 9 మందిని స్థానికులు రక్షించారు. గొర్రె శివపార్వతి (35) అనే మహిళ మాత్రం గల్లంతైంది. వరద ప్రభావంతో పరిసర గ్రామ ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందారు. ఇవాళ బుడమేరు కాస్త శాంతించడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.


ఇవి కూడా చదవండి...

Vijayawada Floods: వరద తాకని రాజధాని!

నా జనం ఏమయ్యారు?

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 03 , 2024 | 10:42 AM