Share News

Chennai: రౌడీ రాజా దారుణహత్య..

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:48 PM

పలు హత్యానేరాల్లో నిందితుడైన రాజా బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. అరియూర్‌కు చెందిన పోకిరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ రాజా(Rajkumar alias Raja) బుధవారం ద్విచక్రవాహనంలో అరియూర్‌ ప్రాంతంలో వస్తుండగా, అతడి వెనుకగా కారులో వచ్చిన ముఠా మారణాయుధాలతో దాడి చేసింది.

Chennai: రౌడీ రాజా దారుణహత్య..

వేలూరు(చెన్నై): పలు హత్యానేరాల్లో నిందితుడైన రాజా బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. అరియూర్‌కు చెందిన పోకిరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ రాజా(Rajkumar alias Raja) బుధవారం ద్విచక్రవాహనంలో అరియూర్‌ ప్రాంతంలో వస్తుండగా, అతడి వెనుకగా కారులో వచ్చిన ముఠా మారణాయుధాలతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజా అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ మణివన్నన్‌ పరిశీలించారు. ఈ ఘటనపై అరియూర్‌ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో, కనియంబాడి సమీపం వల్లమ్‌ ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్ట్‏లో వేలూరు తాలూకా ఇన్స్‌పెక్టర్‌ శుభ నేతృత్వంలో వాహనతనిఖీలు చేపట్టారు.

ఇదికూడా చదవండి: Zika virus: ‘జికా’ వస్తోంది తస్మాత్ జాగ్రత్త!


nani2.2.jpg

ఆ సమయంలో అటువైపు వస్తున్న కారును అడ్డుకొని తనిఖీ చేయగా, అందులో పెద్ద సంఖ్యలో మారణాయుధాలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అరియూర్‌కు చెందిన దేవరాజ్‌, అజిత్‌కుమార్‌, రాజేష్‌, బాబు, కార్తికేయన్‌, గణేష్‏లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్దిరోజుల కిత్రం రాజాకు నిందితులకు మధ్య వివాదం చెలరేగినట్లు, ఆ సమయంలో మిమ్మల్ని హతమారుస్తానని రాజా బెదిరించినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే రాజాను నిందితులు హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. కాగా, హతుడు రాజాపై పలు పోలీస్ స్టేషన్‌లలో 100కు పైగా కేసులుండగా, వాటిలో 20 హత్యాకేసులుండడం గమనార్హం.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 12:48 PM