CM Chandrababu: అమరావతిపై శ్వేతపత్రం విడుదల
ABN, Publish Date - Jul 04 , 2024 | 11:26 AM
అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి ‘నాది’ అని గర్వంగా గుర్తించాలని చెప్పారు. కొత్త ప్రణాళికలు లేవని, వాటినే కొనసాగిస్తూ నిర్మిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీ సచివాలయంలో బుధవారం మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో హెచ్వోడీ, సెక్రటేరియట్లను ఎక్కడ నిర్మించబోయేది నమూనాలో చూపిస్తున్న సీఎం చంద్రబాబు..

రాజధాని అమరావతిలో సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనే కేంద్రంగా పునర్నిర్మిస్తామని మీడియాకు వివరిస్తున్న చంద్రబాబు..

అమరావతిలో జడ్జిస్, మినిస్టర్స్ భవనాలకు ఎక్కడ నిర్మించబోయేది మ్యాప్ ద్వారా మీడియాకు చెబుతున్న ముఖ్యమంత్రి..

న్యాయపరమైన చిక్కులు తొలగించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునర్నిర్మిస్తామని మీడియా సమావేశంలో వివరిస్తున్న సీఎం చంద్రబాబు..

రాజధాని అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రేటరీ, సెక్రేటరీ భవనాల నిర్మాణాలను నమూనాలో ముఖ్యమంత్రి మీడియాకు చూపుతున్న దృశ్యం.
Updated at - Jul 04 , 2024 | 11:26 AM