Share News

Damodar Rajanarasimha: ప్రతీ 20 కిలోమీటర్లకు డయాలసిస్‌ కేంద్రం

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:31 AM

ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

Damodar Rajanarasimha: ప్రతీ 20 కిలోమీటర్లకు డయాలసిస్‌ కేంద్రం

  • జిల్లాకు ఒక క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌

  • నియోజకవర్గానికో ట్రామా కేర్‌ సెంటర్‌: రాజనర్సింహ

మదనాపురం, ఆగస్టు 11: ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వనపర్తి జిల్లా మదనాపురం మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీ కారం, కొన్నూరు గ్రామంలో పలు అభివృద్ధి పను ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందన్నారు.


జిల్లాకు ఒక క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌తో పాటు ప్రతీ నియోజకవర్గంలో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి 35 కిలోమీటర్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రూ.580 కోట్లు అదనపు భారం పడుతున్నా ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షల వరకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Aug 12 , 2024 | 03:31 AM