Share News

Hyd : మన టీచర్లకు జాతీయ అవార్డులు

ABN , Publish Date - Aug 28 , 2024 | 06:15 AM

తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘ జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు.

Hyd : మన టీచర్లకు జాతీయ అవార్డులు

  • ఖమ్మం, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరికి పురస్కారం

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘ జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు. ఖమ్మం రూరల్‌ మండలం తిరుమలాయపాలెం జడ్పీఎ్‌సఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న పెసర్ల ప్రభాకర్‌ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీహెచ్‌ఎ్‌సలో పనిచేస్తున్న తందూరి సంపత్‌కుమార్‌ ఈ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ అవార్డుకు దేశ వ్యాప్తంగా మొత్తం 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అను జైన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీలోని నిర్వహించే కార్యక్రమంలో వీరికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవారులో భాగంగా రూ. 50 వేలు, మెరిట్‌ సర్టిఫికెట్‌, సిల్వర్‌ మెడల్‌ను అందించనున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 06:15 AM