Share News

Hyderabad: తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్‌.. అల్లాపూర్‌లో కిడ్నాపర్లు?

ABN , Publish Date - Jul 03 , 2024 | 10:15 AM

అల్లాపూర్‌ డివిజన్‌ గాయత్రీనగర్‌(Gayatrinagar)లో బాలిక కిడ్నాప్‌ యత్నం జరిగిందంటూ సోమవారం కలకలం రేగింది. 6వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్‌ బస్సు దిగి ఇంటికి నడిచి వస్తుండగా ఒకడు వెంబడిస్తున్నట్టు గమనించింది.

Hyderabad: తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్‌.. అల్లాపూర్‌లో కిడ్నాపర్లు?

- కాలనీలో రెండు వారాలుగా కొత్త వారి సంచారం

- సోమవారం బాలిక కిడ్నా్‌పనకు యత్నం?

హైదరాబాద్: అల్లాపూర్‌ డివిజన్‌ గాయత్రీనగర్‌(Gayatrinagar)లో బాలిక కిడ్నాప్‌ యత్నం జరిగిందంటూ సోమవారం కలకలం రేగింది. 6వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్‌ బస్సు దిగి ఇంటికి నడిచి వస్తుండగా ఒకడు వెంబడిస్తున్నట్టు గమనించింది. అగంతుకుడు బాలిక వెంటే ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు. రెండో అంతస్తుదాకా వెంబడించిన అగంతుకుడిని గుర్తించిన బాలిక భయపడిపోయింది. అతడికి చిక్కకుండా వేగంగా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, అగంతుకుడి గురించి సమాచారమిచ్చింది. బాలిక తల్లిదండ్రులు వచ్చే సమయానికి సదరు వ్యక్తి పరారయ్యాడు. రెండు వారాలుగా ఇలాంటి కిడ్నాప్‌ యత్నాలు జరిగాయని కాలనీవాసులు చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఏడాదిగా ఆగని వరకట్న వేధింపులు.. మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య


city1.jpg

కాలనీలో అపరిచితుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఇదే తరహాలో గతనెల 19న కొందరు అగంతుకులు స్కూల్‌ సమీపంలో చిన్నారులకు బిస్కెట్‌లు, చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నట్లు స్థానికులు గమనించారు. కాలనీలోని పలు అపార్ట్‌మెంట్ల వద్ద కూడా అగంతుకులు రెక్కీ నిర్వహిస్తున్నారని, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళితే ఇంట్లో ఒంటరిగా ఉండే పిల్లలను టార్గెట్‌ చేస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం స్కూల్‌ బస్సులు వచ్చే టైముకు ముందునుంచి అపార్టుమెంట్ల వద్ద అగంతుకులు తచ్చాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 10:15 AM