Share News

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:36 PM

Telangana: రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈకేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 1012 ... సెక్షన్ 22(సీ),27(ఏ),27(ఏ)29 ఆర్/డబ్ల్యూ, 8సీ ఎన్‌డీపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.

Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
Drugs Case

హైదరాబాద్, జూలై 16: రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో (Drugs case) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కొటిక్ బ్యూరో, ఎస్‌వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈకేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 1012.. సెక్షన్ 22(సీ), 27(ఏ), 27(ఏ) 29 ఆర్/డబ్ల్యూ, 8సీ ఎన్‌డీపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది.

Balineni Srinivas: త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా.. బాలినేనిశ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు


ఏ1గా అనోహా బ్లెస్సింగ్ అనే నైజేరియన్ మహిళ ఉండగా, ఏ6గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చారు. అలాగే ఐదుగురు నిందితులను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు తేల్చారు. నిందితులకు వైద్య పరిక్షలు పూర్తి అవ్వగానే వారిని మరికాసేపట్లో రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నారు.

Doda encounter: నలుగురు జవాన్లు వీరమరణం.. రంగంలోకి రక్షణ మంత్రి


డ్రగ్స్ కేసులో కీలక నిందితులు

డ్రగ్స్ పెడ్లర్స్..

A 1 అనూహా బ్లెస్సింగ్, నైజీరియన్

A 2 అజీజ్ నోహిమ్, నైజీరియన్

A 3 అల్లం సత్య వెంకట గౌతమ్ , బెంగళూరు

A 4 సానబోయిన వరున్ కుమార్, బొమ్మిడివరం,ఈస్ట్ గోదావరి

A 5 మహ్మద్ మహబూబ్ షరీఫ్, భద్రాద్రి కొత్తగూడెం.


ఇవి కూడా చదవండి...

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 12:50 PM