Share News

AP Election Results: టీడీపీ విజయంపై రేవంత్ స్పందన.. తొలి కామెంట్ ఇదే..

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:18 PM

AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు రేవంత్. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్.

AP Election Results: టీడీపీ విజయంపై రేవంత్ స్పందన.. తొలి కామెంట్ ఇదే..
CM Revanth Reddy

AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు రేవంత్. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని ఆకాంక్షించారు.


టీడీపీ కూటమి ఘన విజయం..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లను సాధించింది. అధికార వైసీపీని మట్టికరిపించి.. అనూహ్యంగా 164 స్థానాల్లో విజయం దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా భారీ మెజార్టీతో టీడీపీ కూటమి గెలుపొందింది. టీడీపీ కూటమి గెలుపుతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యాలయాల్లో బాణాసంచా కాల్చి, డ్యాన్సులు వేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 04 , 2024 | 08:18 PM