Janasena Leader: ఎంపీ ఎంవీవీ స్థాయి దిగజారి ప్రవర్తించారు.. చాలా దారుణం

ABN , First Publish Date - 2023-07-21T12:02:55+05:30 IST

పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును ఎంపీ ఎంవీవీ ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు.

Janasena Leader: ఎంపీ ఎంవీవీ స్థాయి దిగజారి ప్రవర్తించారు.. చాలా దారుణం

విశాఖపట్నం: పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును (MP Raghuramakrishnaraju) ఎంపీ ఎంవీవీ (MP MVV) ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు. సాటి ఎంపీ రఘురామపై ఎంపీ ఎంవీవీ నోరుపారేసుకున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీగా తన స్థాయిని మరిచి దిగజారి ప్రవర్తించారని..ఇది చాలా దారుణమన్నారు. ప్రశాంత విశాఖ పరువును బంగాళాఖాతంలో కలిపేశారని.. వెంటనే విశాఖ ఎంపీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మధురవాడలో వృద్ధుల కోసం కేటాయించిన హయగ్రీవ స్ధలాన్ని లాగేసుకున్నారన్నారు. క్రైస్తవ మిషనరీకి చెందిన సీబీసీఎన్సీ భూముల్లో భారీ నిర్మాణాలకు తెగబడ్డారని ఆరోపించారు. కూర్మాన పాలెంలో శ్మశానాన్ని, రైవాడ కాలువను, పార్కును కబ్జా చేశారని స్థానిక కార్పొరేటర్ ఒకరు జీవీఎంసీలో ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. సిట్‌లో ఉన్న స్ధలాలను కూడా సెటిల్ చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ఎంవీవీ కుటుంబ కిడ్నాప్ ఉదంతంపై వాస్తవాలు తేలాలని కోరితే రఘురామకృష్ణం రాజుపై నోరుపారేసుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఎంపీ ఎంవీవీపై గతంలో రౌడీషట్ కూడా ఉందన్నారు. ఎంవీవీని వైసీపీ సస్పెండ్ చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-21T12:02:55+05:30 IST