Share News

Bus Accident: ఘోరం.. 30అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 10:31 AM

వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Bus Accident: ఘోరం.. 30అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..

పులివెందుల: వైఎస్ఆర్ (YSR) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పులివెందుల (Pulivendula) సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు (APSRTC Bus) 30అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించపోయిన బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగల లోయలో పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే లోయ వద్దకు పరుగులు పెట్టారు. సమాచారాన్ని పోలీసులకు అందించగా వారూ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు కలిసి బస్సులోని వారిని బయటకు తీశారు. గాయాలపాలైన బాధితులను హుటాహుటిన పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

YS Jagan:అమ్మ, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్.. ఆస్తుల కోసమేనా..?

YSRCP:అన్నా.. సారీ.. నీతో ఉండలేను.. జగన్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో సీనియర్ నేత..

Updated Date - Oct 23 , 2024 | 10:35 AM