Share News

CM Chandrababu: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఏమేం చర్చించారు..!?

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:35 AM

Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్ర నుంచి ఆర్థిక సాయాన్ని అందించాల్సింది బాబు కోరినట్లు సమాచారం.

CM Chandrababu: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఏమేం చర్చించారు..!?
AP CM Chandrababu Naidu

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (PM Narendra Modi) ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సమావేశం జరిగింది. ఏపీకి (Andhrapradesh) సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం (Polavaram Project), అమరావతి నిర్మాణానికి కేంద్ర నుంచి ఆర్థిక సాయాన్ని అందించాలని బాబు కోరినట్లు సమాచారం.

Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..


కాగా.. అంతకుముందు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో (Union Minister Piyush Goyal) ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశం అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) , 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Union Minister Shivraj Singh Chauhan).. 2:45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో (Central Home Minister Amit Shah) వరుసగా చంద్రబాబు భేటీ అవుతారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు.. రేపు కూడా పలువురు కేంద్ర పెద్దలను కలిసి ఏపీకి చెందిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్ నిర్మాణం, కేంద్రం మద్దతు సహకారం ఎజెండాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సాగుతోంది.


ఇవి కూడా చదవండి...

CM Revanth: ప్రధాని మోదీ సీఎం రేవంత్ భేటీ... చర్చించే అంశాలివే!

Chandra Bose: ‘మాటిచ్చా.. సరస్వతి గుడిని నిర్మించా’

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 04 , 2024 | 11:38 AM