Share News

AP News: నూజివీడులో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:46 AM

నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.

AP News: నూజివీడులో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఏలూరు: నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం పాపను అక్కడే వదిలేసి పారిపోయారు. ప్రాణాపాయస్థితిలో పడివున్న బాలికను గుర్తించిన కుటుంబసభ్యులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.


ఘటనపై మంత్రి పార్థసారథి ఆగ్రహం..

అయితే ఘటనపై ఏపీ గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని, అందుకు పోలీస్ జాగిలాలను రంగంలోకి దింపాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - Aug 05 , 2024 | 11:49 AM