Share News

Road Accident: పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Apr 04 , 2024 | 07:08 AM

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Road Accident: పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖ:పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పేర్లు వచ్చేసి హనుమంతు ఆనందరావు (45).. హనుమంతు శేఖర్ రావు (15).. చింతాడి ఇందు (65).

తంటాలు పడి తరలించినా.. టాటా!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 04 , 2024 | 07:10 AM