Share News

Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Jul 14 , 2024 | 11:57 AM

పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఈనెల 19వ తేదీన ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ జె.శ్రీలత తెలిపారు.

Hyderabad: హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam) గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఈనెల 19వ తేదీన ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ జె.శ్రీలత తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు జూలై 19న రాత్రి 8గంటలకు నగరంలోని ఎంజీబీఎస్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజైన 20వ తేదీన ఉదయం ఏపీలోని కాణిపాకం చేరుకుంటుందన్నారు. కాణిపాకంవినాయక ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తమిళనాడులోని వేలూరు(Vellore)లోని స్వర్ణ దేవాలయానికి చేరుకుని దర్శనానంతరం అరుణాచలం ఆలయానికి చేరుకుంటుందన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్‌.. బెడ్‌రూంలోకి దూసుకొచ్చిన బుల్లెట్‌


21వ తేదీన గురుపౌర్ణమి రోజున అరుణాచలంలో గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 6 గంటలకు బయల్దేరి 22వ తేదీన ఉదయం 6గంటలకు నగరానికి చేరుకుంటుందని ఆర్‌ఎం వివరించారు. ప్రయాణ చార్జిగా ఒక్కరికి రూ.3,700 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ముందుగా టికెట్లను రిజర్వు చేసుకోడానికి రిజర్వేషన్‌ సౌకర్యం స్వయంగా బస్‌స్టేషన్లలో, ఏటీబీ ఏజెంట్ల వద్ద గానీ, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ద్వారా గానీ పొందవచ్చని ఆర్‌ఎం తెలిపారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 11:57 AM