Share News

BRS: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు.. సజ్జనార్‌పై మండిపడ్డ జీవన్ రెడ్డి

ABN , Publish Date - May 10 , 2024 | 02:44 PM

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే కారణంతోనే కాంగ్రెస్ తమపై కక్షకట్టిందన్నారు.

BRS: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు.. సజ్జనార్‌పై మండిపడ్డ జీవన్ రెడ్డి

నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్(BRS) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు.

శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే కారణంతోనే కాంగ్రెస్ తమపై కక్షకట్టిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు.


"ఆర్మూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లిన మరునాడే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మా షాపింగ్ మాల్‌పై పడ్డారు. నాపై ఒత్తిడి తెచ్చేందుకు రెండు వందల మందిని పంపించి అక్రమంగా మాల్లో చొరబడ్డారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా, లేదా? మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఆర్మూర్ ఏసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై చర్యలు తీసుకోవాలి.

ఆయనకు అక్రమ ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చే రాజ్యసభ సీటు కోసమే ఆయన అలా చేస్తున్నారు. ఈ విషయంలో ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. హుబ్లీ.. హైదరాబాద్లో ఉన్న సజ్జనార్ ఆస్తులపై విచారణ జరపాలి. కరోనా సమయంలో వందల కోట్ల మెడిసిన్లను కర్ణాటకకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. నేను ఆర్మూర్‌లో ఓడటానికి కారణం ఆయనే" అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 02:47 PM