Group 2 Mains: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
ABN , Publish Date - Feb 12 , 2025 | 08:16 PM
Group 2 Mains: గ్రూప్ 2 మెయిన్స పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వీటిని గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్నాయి.

అమరావతి, ఫిబ్రవరి 12 : మరికొద్ది రోజుల్లో గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్ష హాల్ టికెట్లను గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకో వచ్చని అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్ లైన్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పింది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వివరించింది.
అసలు అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 5వ తేదీన నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షా తేదీని సైతం ఖరారు చేసింది. కానీ సిలబస్ మార్పుతోపాటు పూర్తి స్థాయి సన్నద్దత కోసం మరింత గడువు కావాలని అభ్యర్థులు.. ఏపీపీఎస్సీని కోరారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా తేదీని ఫిబ్రవరి 23వ తేదీకి మార్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92, 250 మంది అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
2023, డిసెంబర్ 7వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. 2024, జనవరి 10వ తేదీ దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీగా నిర్ణయించింది. 2024, ఫిబ్రవరి 25వ తేదీన ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు 2025, ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News