Share News

MP Laxman: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి

ABN , First Publish Date - 2023-12-02T17:56:49+05:30 IST

తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ( MP Laxman ) అన్నారు. శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుమల వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

MP Laxman: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి

తిరుపతి: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ( MP Laxman ) అన్నారు. శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుమల వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని అన్నారు. భక్తుల విరాళాలు దేవుడి కైంకర్యాలకు వినియోగించాలని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. ప్రాచీన కట్టడాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పురాతన కట్టడాలను కూల్చే సమయంలో టీటీడీ భక్తుల మనోభావాలని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. పార్వటి మండపం పునర్ నిర్మాణం సమయంలో టీటీడీ ఆర్కాలజీ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించిందో లేదో భక్తులకు తెలియజేయాలని చెప్పారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను టీటీడీ ధర్మ ప్రచారం కోసం మాత్రమే వినియోగించాలన్నారు. తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వ నిధులనో లేక నగరపాలిక నిధులను వినియోగించాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.

Updated Date - 2023-12-02T17:56:50+05:30 IST