Share News

AP Elections; జనసేన కోసం తరలివస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

ABN , Publish Date - May 07 , 2024 | 10:55 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్‌ఆర్‌ఐ‌లు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

AP Elections; జనసేన కోసం తరలివస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

విశాఖపట్నం, మే 7: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) జనసేన పార్టీ (Janasena) గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు (NRI) తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్‌ఆర్‌ఐ‌లు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan), ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్‌ఆర్‌ఐలు ప్రచారం నిర్వహించారు.

Fact Check: బరితెగింపు.. ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ ప్రచారం..!


ఈ సందర్భంగా శంకర్ సిద్ధం మాట్లాడుతూ.. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుమారు 200 మంది యూకే, కెనడాల నుంచి వచ్చారన్నారు. ఈ సైకో ప్రభుత్వం పోవాలని లక్షల ఖర్చు పెట్టుకుని జనసేన పార్టీకి ఓటు వేసేందుకు వచ్చామని తెలిపారు. వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి అదే వై నాట్ 175 గెలుపుతో కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి బయటికి పంపనుందన్నారు. మా యువత మేధస్సుకు ఇక్కడ సరైన గుర్తింపు లేక ఇతర దేశాలకు వెళ్లి అక్కడ పనిచేసే పరిస్థితి వచ్చిందన్నారు. వాలంటీర్లు ఉద్యోగాలు పేరుతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితాలను జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నో కష్టాలు వడుదుడుకులు ఎదుర్కొని వస్తున్న పవన్ కళ్యాణ్‌కు అందరూ అండగా నిలబడి రేపు జరగబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శంకర్ సిద్ధం కోరారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ‘‘నవ సందేహాలు’’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈసారి దేనిగురించంటే?

TDP: గజపతినగరంలో టీడీపీ జోరు.. శ్రీనివాస్ దెబ్బకు బొత్స కుటుంబం విలవిల

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 11:16 AM