Share News

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Jul 04 , 2024 | 10:34 AM

Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బాబు... పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రమే ముఖ్యమంత్రి హస్తినకు చేరుకున్నారు.

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
AP CM Chandrababu Naidu met PM Modi

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (PM Narendra Modi) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) గురువారం ఉదయం సమావేశమయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బాబు... పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రమే ముఖ్యమంత్రి హస్తినకు చేరుకున్నారు.

Chandrababu: చంద్రబాబు, జగన్‌ల షెడ్యూల్‌పై ఏపీలో ఇంట్రస్టింగ్ చర్చ


ఈరోజు ఉదయం ముందుగా వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో (Union Minister Piyush Goyal) భేటీ అయిన సీఎం.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధానితో బాబు సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) , 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Union Minister Shivraj Singh Chauhan).. 2:45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో (Central Home Minister Amit Shah) చంద్రబాబు భేటీ అవుతారు.


ఆపై రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో (NITI Aayog CEO BVR Subrahmanyam),10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో (Union Minister Nirmala Sitraraman), 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో (Union Health Minister JP Nadda), 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో (Union Minister Athavale) ఇలా వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. ఆపై పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు పయనం కానున్నారు.


ఇవి కూడా చదవండి...

BRS: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారం స్వాధీనం

YSRCP: ప్లీజ్.. ప్లీజ్ టీడీపీలోకి వచ్చేస్తాం.. వెంటపడుతున్న వైసీపీ నేతలు!

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 04 , 2024 | 10:56 AM