Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు..

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) గురువారం రోజున శ్రీశైలం(Srisailam)లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబుస్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పరిశీలించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు..
AP CM Chandrababu Naidu

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) గురువారం రోజున శ్రీశైలం(Srisailam)లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబుస్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పరిశీలించారు.


అనంతరం సుండిపెంట ప్రజావేదిక, హెలిప్యాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు సైతం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు..

గురువారం ఉదయం 9:50గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం స్వామీఅమ్మవార్లను దర్శించుకుంటారు. శ్రీశైల ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు. తర్వాత కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సున్నిపెంట వాటర్ యూజర్స్‌ అసోసియేషన్ సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చాగోష్టి నిర్వహిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.

Updated Date - Jul 31 , 2024 | 02:16 PM