Share News

AP TDP: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:59 PM

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు.

AP TDP: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో నేడు పల్లా శ్రీనివాసరావు చంద్రబాబును కలిశారు. పల్లాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.


అయితే ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వ్యవహరించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ అధ్యక్షునిగా వేరే వారిని నియమించాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావును నియమించడంతో టీడీపీ కేడర్ అభినందనలు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

AP New Cabinet: ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్, లోకేష్‌కు ఏమిచ్చారంటే..?

NMD Farooq: అఘోరా అలా చెప్పాడు.. ఇలా ఫరూక్ మంత్రి అయ్యాడు!

For More AP News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 04:09 PM