Share News

Viral News: కుమారుడిపై తల్వార్‌తో దాడి.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా..?

ABN , Publish Date - Aug 19 , 2024 | 07:29 PM

తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.

Viral News: కుమారుడిపై తల్వార్‌తో దాడి.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా..?
Maharashtra Woman Saves Son's Life

కొల్హాపూర్: తల్లికి బిడ్డలు ఎప్పుడూ పిల్లలే.. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు..! కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో (Maharashtra) ఇలాంటి ఘటన జరిగింది. ఓ యువకుడిపై మరొకతను కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇంకేముంది పక్కనే ఉన్న తల్లి శివాలెత్తింది. రాయి తీసుకొని దాడి చేసేందుకు వచ్చిన యువకుడిని పరుగు తీయించింది.


ఇది విషయం

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో పట్టపగలే ఈ ఘటన జరిగింది. జయ్ సింగ్‌పూర్ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు తల్లితో కుమారుడు మాట్లాడుతున్నాడు. స్కూటీ మీద కూర్చొని ఏదో అంశంపై డీప్‌గా డిస్కష్ చేస్తున్నాడు. ఇంతలో ఒకడు పెద్ద కత్తిని తీసుకొచ్చాడు. స్కూటీ మీద కూర్చొన్న యువకుడిపై దాడి చేయబోయాడు. ఆ దాడి నుంచి యువకుడు తృటిలో తప్పించుకున్నాడు.


brave-mother.jpg


వెంటనే స్పందించిన తల్లి

అతని తల్లి ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. క్షణాల్లో స్పందించారు. పక్కన ఉన్న రాయి తీసుకొని కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో కత్తి తీసుకొచ్చిన వ్యక్తి పరుగు తీశాడు. తల్లితో యువకుడు కూడా రాయి తీసుకొని కొట్టేందుకు ట్రై చేశాడు. దాంతో దాడి చేసేందుకు వచ్చిన వారంతా పరుగు తీశారు.


విషయం ఇది..

సదరు యువకుడితో దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తికి గొడవ జరిగింది. ఒకసారి దాడి చేశారు. ప్రతీకారంగా కత్తి తీసుకొచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతని తల్లి కాపాడారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ తల్లి తీరును అంతా శభాష్ అని మెచ్చు కుంటున్నారు. ఆ తల్లి రాయి పట్టడంతో కత్తితో ఉన్న యువకుడు కూడా పారిపోయాడని గుర్తు చేస్తున్నారు.

Also Read:Kolkata Doctor: ఆధారాలు దొరకొద్దనే ధ్వంసం చేశారు..!

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 19 , 2024 | 07:46 PM