Share News

Manikonda: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:52 AM

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ప్రమాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మరణించింది. కాజీపేట మండలం మడికొండలో శనివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

Manikonda: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి

  • కాజీపేట మండలం మడికొండ వద్ద రోడ్డు ప్రమాదం

మడికొండ, జూలై 20: స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ప్రమాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మరణించింది. కాజీపేట మండలం మడికొండలో శనివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మడికొండ ఎస్సీ కాలనీకి చెందిన కలకోట స్వప్న(40) అదే ప్రాంతంలో శనివారం రాత్రి డివైడర్‌ మధ్య నుంచి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది.


దీంతో ఎగిరిపడిన స్వప్న అక్కడిక క్కడే మరణించింది. ప్రమాద సమయంలో రాజయ్య కారులోనే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగిన రాజయ్య... బాధిత మహిళను చూశారని, ‘పోలీసుస్టేషన్‌కు వచ్చి మాట్లాడతా.. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు’ అని పోలీసులతో అన్నారని సమాచారం. ప్రమా దానికి కారణమైన కారును కాజీపేట బాపూజీనగర్‌లో వదిలిసే రాజయ్య వెళ్లిపోయారు. కాగా, మృతురాలు స్వప్నకు భర్త, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jul 21 , 2024 | 04:52 AM