Share News

Konda Visweswar Reddy: ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ మోదీ వేవ్..

ABN , Publish Date - May 20 , 2024 | 12:44 PM

ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగిసినందున బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధినేతల తరుఫున పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర భారత దేశంలోనే కాదు దక్షిణ భారత దేశంలోనూ ప్రధాని మోదీ వేవ్ కనిపిస్తోందన్నారు.

Konda Visweswar Reddy: ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ మోదీ వేవ్..

ఢిల్లీ: ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగిసినందున బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధినేతల తరుఫున పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర భారత దేశంలోనే కాదు దక్షిణ భారత దేశంలోనూ ప్రధాని మోదీ వేవ్ కనిపిస్తోందన్నారు.

Rave Party: బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు


గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇప్పుడు మోదీ వేవ్ కనిపిస్తోందని.. మోదీ కోసం ఓటు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీపై దుష్ప్రచారం చేసిందన్నారు. లిక్కర్ స్కాం, కవిత అరెస్ట్‌లపై కాంగ్రెస్ తెలంగాణలో ఒకలా మాట్లాడిందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని తెలిపారు. లిక్కర్ స్కాం విషయంలో కాంగ్రెస్ తెలంగాణలో ఒకలా... ఢిల్లీలో ఒకలా మాట్లాడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కన్ఫ్యూజ్ పార్టీ అని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

PM Modi: ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ప్రధాని మోదీ సంతాపం

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 12:44 PM