Share News

Purandeswari: రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:46 PM

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) వ్యాఖ్యానించారు. ఈ రైల్వే స్టేషన్‌ను రూ. 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

 Purandeswari: రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతాం
Purandeswari

రాజమండ్రి: రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) వ్యాఖ్యానించారు. ఈ రైల్వే స్టేషన్‌ను రూ. 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. శనివారం నాడు రాజమండ్రి స్టేషన్‌ను ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ సందర్శించారు స్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై రైల్వే అధికారులతో చర్చించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... గోదావరి పుష్కరాలకు 2027 జనవరి నాటికే పూర్తి చేయాలని కోరామని అన్నారు.రాజమండ్రి రైల్వేస్టేషన్‌ను తూర్పు వైపున కూడా అభివృద్ధి చేయాలని అడిగామని చెప్పారు.

సానుకుల వాతావరణంలో ఈరోజు రైల్వే అధికారులతో సమావేశం జరిగిందని తెలిపారు. రాజమండ్రి రైల్వేస్టేషన్ సమస్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కొవ్వూరు, అనపర్తి స్టేషన్‌లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తూర్పు రైల్వే స్టేషన్ వైపు అభివృద్ధి చేసేలా చర్చించామని అన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేలా నిర్ణయించామని తెలిపారు. కేశవరం దగ్గర ఆర్వోబీ ఏర్పాటు చేశామని చెప్పారు. అనపర్తిలో జన్మభూమి హాల్ట్ ఉంటుందని వెల్లడించారు. అనపర్తిలో త్వరలోనే పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని వెల్లడించారు. జనవరి 2027 కల్లా పనులు పూర్తి చేయాలని నిర్ణయించామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.


అన్నపూర్ణమ్మ పేట అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి: ఎమ్మెల్యే గోరంట్ల

రాజమండ్రి తూర్పు రైల్వేస్టేషన్ రోడ్డును విస్తరణ చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు. అన్నపూర్ణమ్మ పేట అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. హేవలాక్ వంతెన పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.


విశాఖ వెళ్లే రైళ్లు అందుబాటులో ఉంచాలి: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విశాఖ వెళ్లే రైళ్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలు రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయాలని కోరారు. అనపర్తిలో స్టేషన్‌లో జన్మభూమి హాల్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి అడిగామని చెప్పారు. బిక్కవోలు రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయాలని కోరామన్నారు. కేశవరం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై డీఆర్ఎం సానుకూలంగా స్పందించారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

రైల్వేస్టేషన్ తూర్పు వైపు అభివృద్ధి చేస్తాం: నరేందర్ పాటిల్

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచన మేరకు రైల్వేస్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ధి చేస్తామని రైల్వే డీఆర్ఎం నరేందర్ ఏ పాటిల్ అన్నారు. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెనపై భారీ వాహనాలు నిషేధించాలని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పామని డీఆర్ఎం నరేందర్ ఏ పాటిల్ తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 08:38 PM