Share News

Nara lokesh: మేమంతా గర్వపడేలా వారు చేయాలని ఆకాంక్షిస్తున్నా...

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:11 PM

Andhrapradesh: ప్యారిస్ ఒలంపిక్స్ 2024లో ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ఏపీ నుంచి జ్యోతి యర్రజి, డి.జ్యోతికా శ్రీలు ప్యారిస్ ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి చేసిన శ్రమకు ఫలితం లభించే సమయం ఇప్పుడు వారికి వచ్చిందన్నారు.

Nara lokesh: మేమంతా గర్వపడేలా వారు చేయాలని ఆకాంక్షిస్తున్నా...
Minister Nara lokesh

అమరావతి, జూలై 5: ప్యారిస్ ఒలంపిక్స్ 2024లో (2024 Paris Olympics) ఏపీ (Andhrapradesh) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు మంత్రి లోకేష్ (Minister Nara lokesh) అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ఏపీ నుంచి జ్యోతి యర్రజి, డి.జ్యోతికా శ్రీలు ప్యారిస్ ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి చేసిన శ్రమకు ఫలితం లభించే సమయం ఇప్పుడు వారికి వచ్చిందన్నారు.

NEET PG Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీలు విడుదల


వారు తమ ఒలంపిక్ మెడల్ డ్రీమ్‌ను అంకిత భావంతో నిజం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. పోరాటపటిమను వదలకుండా వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. 2024 ఒలంపిక్స్‌లో పతకం సాధించి తామంతా గర్వపడేలా వారు చేయాలని ఆకాంక్షస్తున్నట్లు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

YSRCP: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్.. హ్యాండిచ్చేశారుగా..!

BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 04:16 PM