Share News

Minister Subhash: వలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు ప్రమేయ ఉంది.. మంత్రి సుభాష్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 02:53 PM

వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు.

Minister Subhash: వలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు ప్రమేయ ఉంది.. మంత్రి సుభాష్ సంచలన ఆరోపణలు

కోనసీమ జిల్లా: వలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(సోమవారం) రామచంద్రపురంలో మంత్రి సుభాష్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ.... హత్య జరిగిన తర్వాత బాధితుడు ఇంటికి విశ్వరూప్ వెళ్లారని అన్నారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని అన్నారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు.


హత్యకు గురైన వలంటీర్‌కు విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌తో అనుబంధం ఉందని అన్నారు. అందుకే తన కొడుకుకి శ్రీకాంత్ పేరు కూడా పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత బాధితుల్లో ధైర్యం వచ్చి తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరారు. బాధితురాలిని పోలీసు ఉన్నతాధికారుల వద్దకు తీసుకు వెళ్లానని అన్నారు. విచారణ చేయించి బాద్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.


విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ అరెస్ట్

కాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం హత్యకు గురైన వలంటీర్ (Volunteer), దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ (Janupalli Durga Prasad) హత్య కేసు (Murder Case)ను పోలీసులు (Police) చేధించారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ (Pinipe Srikanth)తో పాటు పలువురు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు కేసు విచారణ చేశారు. రమేష్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా హత్య కేసులో పినిపే శ్రీకాంత్ ప్రధాన నిందితుడుగా గుర్తించారు. దీంతో తమిళనాడులోని మధురైలో తలదాచుకున్న శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురైలో పినిపే శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఏపీకి తరలించారు. శ్రీకాంత్‌ అరెస్ట్‌ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.


కాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసుపై విచారణ చేపట్టింది. విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్‌ పేరు పెట్టిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అదే సమయంలో అయినవిల్లికి చెందిన వలంటీరు దుర్గాప్రసాద్‌ 2022 జూన్‌ 6న హత్యకు గురైన విషయం తెలిసిందే.


ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన రమేష్‌ను పోలీసులు విచారించారు. హత్య కేసులో అక్టోబర్ 18న రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ సందర్భంగా మరో నలుగురు నిందితులతో పాటు మాజీ మంత్రి పినిపె శ్రీకాంత్‌ కూడా ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించాలని భావించిన శ్రీకాంత్‌.. రమేష్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కక్షతో వలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్‌‌ను పినిపే శ్రీకాంత్ హత్య చేయించాడు. తన కుటుంబ సభ్యులకు దుర్గాప్రసాద్ అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో కక్ష పెంచుకున్న శ్రీకాంత్ హత్య చేయించినట్లు సమాచారం. రమేష్ రిమాండ్ రిపోర్టు ద్వారా హత్యకు కారణాలు వెల్లడవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..

రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌

అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

జగన్‌ తీరును తప్పుపడుతున్న నాయకులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 21 , 2024 | 03:02 PM