Share News

Woman: ‘‘నేను శివుడు, నువ్వు పార్వతి’’.. మహిళకు వింత కథ చెప్పిన మరో మహిళ.. చివరకు..

ABN , Publish Date - Jun 27 , 2024 | 08:12 PM

ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అంతా ఆప్‌డేట్ అవుతున్నా కూడా కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిరక్ష్యరాస్యుతో పాటూ బాగా చదువుకున్న వారు ..

Woman: ‘‘నేను శివుడు, నువ్వు పార్వతి’’.. మహిళకు వింత కథ చెప్పిన మరో మహిళ.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అంతా ఆప్‌డేట్ అవుతున్నా కూడా కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిరక్ష్యరాస్యుతో పాటూ బాగా చదువుకున్న వారు కూడా ఏవేవో నమ్మకాలను పాటిస్తూ చివరకు ఎదుటి వారిని కూడా ఇబ్బందుల్లో పడేస్తుంటారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘నేను శివుడు, నువ్వు పార్వతి’’.. అంటూ ఓ మహిళ మరో మహిళతో ఏవేవో చెప్పి నమ్మించింది. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. తెలంగాణకు (Telangana) చెందిన భాగ్య అనే మహిళకు.. ప్రకాశం జిల్లా (Prakasam District) లింగసముద్రం మండలం ముత్యాలంపాడుకు చెందిన దేవరకొండ అంకమ్మ అనే మహిళ (woman) ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడే క్రమంలో భాగ్యకు ఓ స్టోరీ చెప్పింది. ‘‘గత జన్మలో నేను శివుడు, నీవు పార్వతి’’.. అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి నమ్మించింది. పదే పదే ఇవే మాటలు చెప్పడంతో భాగ్య కూడా నమ్మింది.

Viral video: వామ్మో..! పాకిస్థాన్‌లో ఇలా చేస్తారా.. కదులుతున్న రైలుపై ఆకతాయిలు నీళ్లు చల్లడంతో చివరకు ..


అయితే అంతటితో ఆగని అంకమ్మ.. భార్యకు తరచూ వీడియో కాల్ (video call) చేసేది. శివుడు నీ వద్దే ఉన్నాడు అని చెబుతూ తాను నగ్నంగా మాట్లాడటమే కాకుండా భార్యను కూడా నగ్నంగా మారమని చెప్పేది. అంకమ్మ మాటలు నమ్మిన భాగ్య.. చివరకు నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసేది. అలాగే ఫొటోలు కూడా పంపమని చెప్పడంతో అలాగే చేసింది. చివరకు భాగ్యతో పాటూ ఆమె ఇద్దరు పిల్లలను కూడా తన వద్దకు తీసుకెళ్లింది. ఇంట్లో భార్యా, పిల్లలు కనిపించకపోవడంతో భాగ్య భర్త జాడి మల్లయ్య పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో చివరకు హోం మినిస్టర్ పేషీలో ఫిర్యాదు చేశాడు.

Viral video: నిద్రిస్తుండగా బాలుడి లోదుస్తుల్లోకి దూరిన పాము.. చివరకు..


సమస్యపై స్పందించిన హోం మంత్రి పీఎస్ రామారావు.. వెంటనే బాధితుడి పిల్లలు, భార్యను కాపాడాలని కందుకూడు డీఎస్సీని ఆదేశించారు. అంకమ్మ చేసిన నిర్వాకాన్ని చెబుతూ జాడి మల్లయ్య బోరున విలపించాడు. అంకమ్మ తన భార్యను నమ్మించడమే కాకుండా తన పిల్లల మనసు కూడా మార్చిందని చెప్పాడు. ‘‘మేకు నీకు పుట్టలేదు.. శివుడికి పుట్టాము’’.. అని తన పిల్లలు తనతో చెప్పే పరిస్థితికి తెచ్చిందని వాపోయాడు. అయితే చివరకు ఇలా వారందరినీ తన వెంట తీసుకెళ్తుందని ఊహించలేదని బోరున విలపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

Updated Date - Jun 27 , 2024 | 08:12 PM