Home » LATEST NEWS
‘నా పల్లె నా కాన్వాసు, నా ప్రజలే నా వస్తువు, వాళ్ల జీవనమే నా ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు, నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, విశ్వయవనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం’– 1945లో హైదరాబాద్లో ఒక చిత్రకళా ప్రదర్శనలో...
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖపై అవగాహన లేని వారిని మంత్రులుగా చేసి ప్రాజెక్టుకు నష్టం కలిగించారని ఆమె విమర్శించారు.
వక్ఫ్ బిల్లులో ముస్లింల హక్కుల కోసం మూడు సవరణలు ప్రతిపాదించిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. వైసీపీ మతం పేరుతో ముస్లింలను మోసగించిందని ఆరోపిస్తూ, ముస్లిం నేతలంతా ఆ పార్టీని వీడాలని ఆయన పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై స్టాండ్-అప్ కమేడియన్ కునాల్ కమ్రా మూడోసారి కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ముంబయి పోలీసులు ఇచ్చిన సమన్లను ఆయన విస్మరించగా, హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది.
ఆయుధాలు వదిలేసి ప్రజలలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 2026 మార్చిలోగా మావోయిస్టుల సమస్యను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని ఆయన బస్తర్ పాండూమ్ కార్యక్రమంలో వెల్లడించారు.
భారత నౌకాదళానికి 26 రఫేల్-మ్యారిటైమ్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం సుమారు రూ.65వేల కోట్ల విలువైన ఒప్పందానికి సిద్ధమైంది. భద్రతపై క్యాబినెట్ కమిటీ ఆమోదం కోసం ఈ నెలాఖరులో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లనున్నది.
జమిలి ఎన్నికల ప్రక్రియ 2029 లోక్సభ ఎన్నికల తర్వాతే ప్రారంభమవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక కొత్త ఆలోచన కాదని, దీనిపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని వ్యాఖ్యానించారు.
కొత్త తరానికి రాజకీయ నాయకులను తయారుచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ పేరిట ఫెలోషిప్ ప్రారంభించింది. ఈ ఫెలోషిప్లో ఎంపికైన నిపుణులకు రాహుల్ గాంధీ, శశిథరూర్ వంటి ప్రముఖులు మెంటార్లుగా మారనున్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలపగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీన్ని ముస్లింలపై దాడిగా విమర్శించారు. ఈ బిల్లుపై సుప్రీంకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలవ్వగా, భవిష్యత్లో ఇతర మతాలపై దాడులకు ఇదో ఉదాహరణగా రాహుల్ వ్యాఖ్యానించారు.
అప్రమత్తంగా నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకునేందుకు గుజరాత్ పోలీసులు ‘జీపీ-ద్రష్టి’ అనే డ్రోన్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ డ్రోన్లు సూరత్, అహ్మదాబాద్లలో ప్రయోగాత్మకంగా విజయవంతమవడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
కోవిడ్ తరహాలో అంతుచిక్కని ఓ వైరస్ రష్యన్లను తీవ్రంగా భయపెడుతోంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ కొత్త వైరస్.. ప్రపంచానికి మరో వైరస్ సవాల్ విసరనుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు.
భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది.
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాములను దర్శించుకునేందుకు ప్రముఖులు, వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కీలకఘట్టమైన ధ్వజారోహణకార్య క్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామక వ్యవహారం టీడీపీలో చిచ్చురేపింది. తాము సూచించిన వారికి పదవులు వస్తాయని భావించిన ఎమ్మెల్యేలు.. జాబితా చూసి షాక్ అయ్యారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జపాన్కు వెళ్లిన ఆయన టోక్యో నగరంలో పర్యటించారు.
Sitamma Gold Saree: సీతమ్మ వారికి బంగారు చీర సిద్ధమైంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల నేతన్న గోల్డ్ చీరను నేశారు.
Nigerian Drug Network: నగరంలో భారీ డ్రగ్ నెట్వర్క్ను నార్కోటిక్ పోలీసులు చేధించారు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.
ఎంపురాన్తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహోస్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం , మహబూబ్నగర్ జిల్లాల నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు.
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. బ్యాంక్లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు.
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ క్రమంలో 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విశాఖపట్నం కలెక్టర్ను ఆదేశించింది. విశాఖ వేదికగా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నాటి టీడీపీ ప్రభుత్వం 2003లో బీమిలి బీచ్ రోడ్డులోని 34. 44 ఎకరాల భూమిని ఎస్పీ ప్రోడక్షన్కు కేటాయించింది.
బంగారు ఆభరణాలు తనఖా పెట్టి వచ్చిన డబ్బులు మెుత్తాన్ని ఖర్చుపెడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే.. తీసుకున్న అప్పులో కొంత తిరిగి చెల్లించాలని లేదా మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాలని అప్పు ఇచ్చిన సంస్థలు అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Bird Flu: రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూతో ఫౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టారు అధికారులు.
Bomb Scare: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. శుక్రవారంతో నామినేషన్లు ముగుస్తుండగా అటు పోటీపై పార్టీలో డైలమా కొనసాగుతోంది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.